Mek Spoof In Mahesh Babu Aagadu
నాగార్జునను మళ్లీ మహేష్ వాడేసుకున్నాడట!
మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ సినిమా విజయం సాధించడానికి మహేష్ ఎంత వరకు కారణమో, హాస్య నటులు బ్రహ్మనందం, ఎమ్మెస్ నారాయణల కామెడీ కూడా అంతే కారణం. ఈ సినిమాలో ఎమ్మెస్ తో పలు హీరోలను ఇమిటేట్ చేయడం, బ్రహ్మనందంతో ఎస్సెమ్మెస్ అడిగించడం వంటి పలు కామెడీ సన్నీవేశాల వల్ల, అలాగే నాగార్జునను కూడా బాగానే వాడుకోవడం వల్ల ఆ సినిమా మరింత హిట్టయ్యింది.
అయితే మళ్లీ శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్లో ‘ఆగడు’ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లు, పాటలకు మంచి స్పందన వస్తోంది. అయితే ‘దూకుడు’ సినిమాలో నాగార్జునను వాడుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజా ‘ఆగడు’ సినిమాలో కూడా నాగార్జునను వాడుకున్నట్లుగా తెలిసింది. ఇటీవలే నాగార్జున వ్యాఖ్యతగా చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఇపుడు ఇదే కార్యక్రమాన్ని ‘ఆగడు’ సినిమాలో స్పూఫ్ గా తీసారని తెలిసింది. అయితే ఇది ఎవరిని కించపరిచే విధంగా కాదని, కేవలం నవ్వించడానికేనని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘అంత్యాక్షరి’ కార్యక్రమం చేసినట్లుగా... ‘ఆగడు’ సినిమాలో కూడా మహేష్ తన పోలీస్ స్టేషన్ లో ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ స్పూఫ్ చిత్రీకరించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నారు.
నాగార్జునను మళ్లీ మహేష్ వాడేసుకున్నాడట!
మహేష్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన ‘దూకుడు’ సినిమా విజయం సాధించడానికి మహేష్ ఎంత వరకు కారణమో, హాస్య నటులు బ్రహ్మనందం, ఎమ్మెస్ నారాయణల కామెడీ కూడా అంతే కారణం. ఈ సినిమాలో ఎమ్మెస్ తో పలు హీరోలను ఇమిటేట్ చేయడం, బ్రహ్మనందంతో ఎస్సెమ్మెస్ అడిగించడం వంటి పలు కామెడీ సన్నీవేశాల వల్ల, అలాగే నాగార్జునను కూడా బాగానే వాడుకోవడం వల్ల ఆ సినిమా మరింత హిట్టయ్యింది.
అయితే మళ్లీ శ్రీనువైట్ల, మహేష్ కాంబినేషన్లో ‘ఆగడు’ చిత్రం తెరకెక్కుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్లు, పాటలకు మంచి స్పందన వస్తోంది. అయితే ‘దూకుడు’ సినిమాలో నాగార్జునను వాడుకున్న విషయం అందరికి తెలిసిందే. తాజా ‘ఆగడు’ సినిమాలో కూడా నాగార్జునను వాడుకున్నట్లుగా తెలిసింది. ఇటీవలే నాగార్జున వ్యాఖ్యతగా చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఇపుడు ఇదే కార్యక్రమాన్ని ‘ఆగడు’ సినిమాలో స్పూఫ్ గా తీసారని తెలిసింది. అయితే ఇది ఎవరిని కించపరిచే విధంగా కాదని, కేవలం నవ్వించడానికేనని చిత్ర యూనిట్ చెబుతున్నారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ ‘అంత్యాక్షరి’ కార్యక్రమం చేసినట్లుగా... ‘ఆగడు’ సినిమాలో కూడా మహేష్ తన పోలీస్ స్టేషన్ లో ఈ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ స్పూఫ్ చిత్రీకరించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెల 19న రిలీజ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment