Monday 15 December 2014

ధోని భార్యగా బాలీవుడ్ కిస్సింగ్ లేడీ

ఇండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని జీవితకథ ఆధారంగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. నీరజ్ పాండే రూపొందించనున్న ఈ సినిమాలో ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ నటించనున్నాడు. అయితే మరో క్రికెటర్ సురేష్ రైనా పాత్రలో రాంచరణ్ నటింనున్నాడని వార్తలొచ్చాయి. కానీ చరణ్ ఈ సినిమాను అంగీకరించలేదు. అయితే ధోనీ ఇటీవలే సాక్షిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరి నిజజీవితంలో వున్న సాక్షిని వెండితెర మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలీయా భట్ ను ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ అమ్మడితో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఏదో ఒక విషయం ఫైనలైజ్ చేయనున్నారు.

No comments:

Post a Comment